Hyderabad: మిస్ వరల్డ్ పోటీ నుంచి మిస్ ఇండియా ఔట్..

Hyderabad: ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిస్ వరల్డ్ 2025 అంతర్జాతీయ సుందరాంగనల పోటీలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా సాగుతున్నాయి. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ ఈ ప్రపంచస్థాయి పోటీకి వేదికగా మారింది. వివిధ దేశాల నుంచి వచ్చిన అందగత్తెలు గౌరవ కిరీటం కోసం పోటీ పడుతున్నారు.

ఈ పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించిన నందిని గుప్తా మంచి ప్రదర్శన, l ప్రస్థానం టాప్-8 దశకు ముందే ముగిసింది. తొలుత ప్రకటించిన టాప్-8 జాబితాలో నందినికి స్థానం దక్కలేదు, ఇది భారత అభిమానులను కొంత నిరాశకు గురిచేసింది.

టాప్-8 లోకి ఎంపికైన దేశాలు:

మార్టినిక్

బ్రెజిల్

ఇథియోపియా

నమీబియా

పోలెండ్

ఉక్రెయిన్

ఫిలిప్పీన్స్

థాయ్‌లాండ్

ఈ సుందరీమణుల్లో నుంచి ఖండాల వారీగా ఒక్కొక్కరు ఫైనల్ నాలుగు స్థానాలకు ఎంపికయ్యారు:

అమెరికా & కరీబియన్: మార్టినిక్

ఆఫ్రికా: ఇథియోపియా

యూరప్: పోలెండ్

ఆసియా: థాయ్‌లాండ్

ఖండాల వారీగా ఎంపికైన ఈ టాప్-4 అందగత్తెలతో న్యాయనిర్ణేతలు ప్రశ్నల రౌండ్ నిర్వహిస్తున్నారు. వారు ప్రదర్శించే తెలివితేటలు, సమాధానాల ఆధారంగా చివరి విజేతను ఎంపిక చేయనున్నారు.

ఈ పోటీలు భారత్‌లో నిర్వహించడమే ఒక గర్వకారణమని, భారత్‌కు మరోసారి గ్లోబల్ ఫ్యాషన్ రంగంలో ప్రాధాన్యత పెరిగిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  CJI Sanjiv Khanna: భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *