Hyderabad

Hyderabad: రీల్ లైఫ్‌లో తండ్రి.. రియల్ లైఫ్‌లో ప్రియుడు..’రాజు వెడ్స్ రాంబాయి’ సీన్ రిపీట్!

Hyderabad: ప్రేమ పేరుతో లోకాన్ని మర్చిపోయేవారు కొందరైతే, అదే ప్రేమ దక్కలేదని ఉన్మాదులుగా మారే వారు మరికొందరు. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పెళ్లి చేసుకోమని కోరితే నిరాకరించిందన్న కోపంతో, ఒక యువకుడు చేసిన అమానుషమైన పని చివరకు 24 ఏళ్ల రమణి అనే యువతి ప్రాణం పోవడానికి కారణమైంది. నమ్మిన వాడే నట్టేట ముంచడమే కాకుండా, ప్రాణాలు తీసేలా వ్యవహరించడం అందరినీ కలిచివేస్తోంది.

హెచ్ఐవీ రక్తం ఎక్కించిన వైనం
వివరాల్లోకి వెళ్తే.. అన్నోజిగూడకు చెందిన రమణికి, మనోహర్ అనే యువకుడితో పరిచయం ఉంది. మనోహర్ తనను పెళ్లి చేసుకోవాలని కోరగా, రమణి ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించింది. తనను కాదన్నదన్న కక్షతో ఊగిపోయిన మనోహర్, గత నెల 11న ఆమెపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా, అత్యంత కిరాతకంగా హెచ్ఐవీ సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఆమె శరీరంలోకి ఎక్కించినట్లు తెలుస్తోంది. సినిమా కథలను మించిపోయిన ఈ వికృత చేష్ట ఆ యువతి జీవితాన్ని తలకిందులు చేసింది.

భయం, అవమానంతో తనువు చాలించిన రమణి
ఈ ఘటన తర్వాత రమణి తీవ్రమైన మానసిక ఆందోళనకు గురైంది. తన శరీరంలోకి ఆ రక్తం చేరడం వల్ల భవిష్యత్తులో ఏం జరుగుతుందోనన్న భయం, సమాజంలో ఎలా తిరగాలన్న అవమానం ఆమెను నీడలా వెంటాడాయి. అప్పటి నుండి మౌనంగా ఉంటూ, ఎవరితోనూ తన బాధను పంచుకోలేక లోలోపలే కుంగిపోయింది. ఆ మనస్తాపంతోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

న్యాయం కోసం పోలీసుల విచారణ
రమణి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అప్పట్లోనే మనోహర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే యువతి మరణంతో ఈ కేసు ఇప్పుడు గంభీరంగా మారింది. నిందితుడు నిజంగానే హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించాడా? లేక కేవలం భయపెట్టడానికే ఆ డ్రామా ఆడాడా? అనే విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి విచారణ ముమ్మరం చేశారు. చేతికి అందొచ్చిన కూతురు కళ్లముందే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *