Drugs Party

Drugs Party: ఐటీ హబ్‌లో డ్రగ్స్ దందా.. గచ్చిబౌలిలో 12 మంది అరెస్ట్‌

Drugs Party: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మాఫియా కదలికలు మరోసారి కలకలం సృష్టించాయి. ఐటీ హబ్‌గా పేరుగాంచిన గచ్చిబౌలి ప్రాంతంలో ఒక కో-లివింగ్ గెస్ట్‌ రూమ్‌లో రహస్యంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు భగ్నం చేశారు. ఈ దాడుల్లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నవారితో పాటు పార్టీలో పాల్గొన్న మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అరెస్ట్ అయిన వారిలో ఆరుగురు డ్రగ్స్ పెడ్లర్స్ (సరఫరాదారులు), ఆరుగురు కన్జ్యూమర్లు (వినియోగదారులు) ఉన్నారు. ప్రధాన స్మగ్లర్ గుత్తా తేజకృష్ణతో పాటు, డ్రగ్స్ సరఫరాలో పాలుపంచుకుంటున్న ఒక నైజీరియన్ పౌరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెట్‌వర్క్‌కు గుత్తా తేజకృష్ణ నాయకత్వం వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: Road Accident: కరీంనగర్‌లో మరో రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని 15 మందికి గాయాలు

వీరు కర్ణాటక రాష్ట్రం నుంచి మాదక ద్రవ్యాలను నగరానికి అక్రమంగా రవాణా చేసి, హైదరాబాద్‌లోని యువతకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దాడిలో వారి నుంచి ఎండీఎంఏ (MDMA), గంజాయితో సహా పలు మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ అయిన ఇతర వ్యక్తులలో వెన్నెల రవికిరణ్‌, మన్నె ప్రశాంత్‌, పీ. హర్షవర్ధన్‌రెడ్డి, పకనాటి లోకేశ్‌రెడ్డి, పృథ్వి విష్ణువర్ధన్‌, కార్లపొడి వెస్లీ సుజీత్‌, గుండబోయిన నాగార్జున, మేకల గౌతం, గుటక సతీశ్‌ రెడ్డి ఉన్నారు. ఈ ఘటనతో నగరంలో డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలు, యువతలో పెరుగుతున్న వ్యసనాలపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌పై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *