Hyderabad: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం క్షీణించడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను స్వయంగా పరామర్శించారు. హైదరాబాద్లోని పవన్ నివాసానికి వెళ్లి ఆయనను కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
గత ఐదు రోజులుగా పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారని, ఆయన కార్యాలయం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వైద్యుల సూచన మేరకు పవన్ ప్రస్తుతం పూర్తి విశ్రాంతి తీసుకుంటూ చికిత్స పొందుతున్నారని సన్నిహితులు తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు పవన్తో కాసేపు మాట్లాడి ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. జనసేన కీలక భాగస్వామ్యంతో కూడిన ప్రభుత్వంలో, స్వయంగా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి పరామర్శించడం, ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత ఆత్మీయతను, రాజకీయ పొత్తు ధర్మాన్ని ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.