Hyderabad: అసెంబ్లీ వద్ద మూడెంచల భద్రతా.. ఎందుకంటే..?

Hyderabad: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 12, 2025 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ప్రధాన చర్చలకు వేదిక కానున్నాయి.

గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం

సమావేశాల తొలి రోజున ఉదయం 11 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగం అనంతరం, ధన్యవాద తీర్మానం చర్చించబడుతుంది.

ప్రధాన అంశాలు, చర్చలు

మార్చి 14: హోలీ పండుగ సందర్భంగా అసెంబ్లీకి విరామం

మార్చి 17: ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ

మార్చి 18: బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై చర్చ

మార్చి 19: రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం

ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) ఏర్పాటుపై చర్చ

డిలిమిటేషన్ ప్రక్రియపై తీర్మానం

భద్రతా ఏర్పాట్లు, నిబంధనలు

అసెంబ్లీ భవనం వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ అమలు చేయబడింది. నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయనుందని, అభివృద్ధి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మార్చి 19 లేదా 20న ప్రవేశపెట్టే బడ్జెట్ పరిమాణం సుమారు ₹3.2 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది.

ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర ప్రజలకు ఎంతో కీలకంగా మారనున్నాయి. ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలు ప్రజల ఆకాంక్షలనుఏ మేరకు తీరుస్తాయో చూడాలి!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *