HYDERABAD: ఉద్రిక్తతంగా.. అఘోరీతో కుటుంబ సభ్యుల ములాఖత్

HYDERABAD: చంచల్‌గూడ జైలులో అరెస్ట్‌లో ఉన్న అఘోరీ శ్రీనివాస్‌ను అతడి తండ్రి, అక్కబావలు కలిసి ములాఖత్ నిర్వహించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన అఘోరీ, భావోద్వేగానికి లోనయ్యినట్టు సమాచారం. జైలు వద్ద ములాఖత్ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు శ్రీనివాస్ బంధువుల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి.

ప్రమాద స్థాయిలో మీడియాను తోసేసిన బంధువులు, వారి ప్రవర్తనతో అక్కడ చిన్నపాటి గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా అఘోరీ తండ్రి మీడియాపై దౌర్జన్యంగా వ్యవహరించాడు. తన కుమారుడి అరెస్టుకు మీడియానే ప్రధాన కారణమంటూ మండిపడ్డాడు.

“మీడియా వల్లే నా కుమారుడిని తప్పుగా చిత్రీకరించారు. నిజాయితీగా ఉన్నవాడిని దొంగలా చూపించారు,” అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన నేపథ్యంలో జైలు ప్రాంగణం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల జోక్యంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Avinash Reddy in liquor scam: లిక్కర్‌ పార్టీ ప్రొడక్షన్‌లో బయటపడ్డ మరో 3 సినిమాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *