Hyderabad: 208 మంది పాకిస్థానీలు.. హైదరాబాద్‌లో గుర్తించిన ఎస్బీ

Hyderabad :పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌లో ఉన్న పాకిస్థానీలు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులను గుర్తించి వెంటనే దేశం నుంచి పంపించాలని కోరింది. ఇప్పటికే పాకిస్థానీలకు జారీ చేసిన వీసాలను రద్దు చేసిన కేంద్రం.. ఏప్రిల్ 29లోగా దేశం విడిచి పోవాలని తెలిపింది. కేంద్రం ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాలు పాకిస్తానీల గుర్తించే పని మొదలు పెట్టారు.

ఈ క్రమంలో తెలంగాణలోని ముఖ్యంగా హైదరాబాద్ లో ఉంటున్న పాకిస్థానీల వివరాలను హైదరాబాద్ ఎస్బీ అధికారులు సేకరించారు. హైదరాబాద్ లో మొత్తం 208 మంది పాకిస్థానీలు ఉంటున్నట్లు గుర్తించారు. వీరిలో 156 మందికి లాంగ్ టర్మ్, 13మందికి షార్ట్ టర్మ్, 39 మందికి బిజినెస్ వీసాలు ఉన్నట్లు తేలింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *