hyderabad: హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం, రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు వర్షం పడే అవకాశముందని తెలిపింది.
హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, మెదక్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్ష సూచనలున్నట్లు వెల్లడించింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మరిన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అవి ఈవిధంగా ఉన్నాయి: ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశముందో ఆ ప్రాంతాల్లో నివసించే వారు వాతావరణ సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.