Hyd News

Hyd News: వేట కొడవలితో ఇద్దరు పిల్లలను హత్య చేసిన తల్లి

Hyd News: హైదరాబాద్‌ సమీపంలోని గాజులరామారంలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను హింసాత్మకంగా హతమార్చి, ఆపై ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన తేజస్విని అనే మహిళ కుటుంబ కలహాలు, పిల్లల అనారోగ్యం, తాను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యిందని భావిస్తున్నారు.

తేజస్వినికి ఇద్దరు చిన్నపిల్లలు – ఆశిష్ (7) మరియు హర్షిత్ (4) ఉన్నారు. వారిద్దరికీ శ్వాసకోశ సమస్యలు ఉండేవి. తేజస్వినికీ కంటి సమస్యలు ఉండటంతో మానసికంగా కుంగిపోయిన ఆమె, గురువారం సాయంత్రం కత్తితో పిల్లలపై దాడి చేసి, అనంతరం ఆరంతస్తుల భవనం పై నుంచి దూకింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.

Also Read: Murder plan: ఆస్తి కోసం హత్య చేసి ఆత్మహత్యగా డ్రామా..!

Hyd News: పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, తేజస్విని రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె లేఖలో తన పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ, పిల్లల బాధలు చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kim Sharma: బికినీతో రచ్చ చేస్తున్న ఖడ్గం బ్యూటీ! రీఎంట్రీ ఖాయమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *