ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికాడంటే అందుకు కారణం.. లంచం ఇచ్చే వాళ్ళు వీడికి డబ్బు ఎందుకు ఇవ్వాలి అనుకుని ఏసీబీకి పట్టిస్తారు. మరికొన్ని ఆఫీసుల తోటి ఉద్యోగులకు పడక వీరిని పట్టించాలన్న కోపంతో ఫోన్ చేస్తారు. కానీ ఓ చోట మాత్రం కట్టుకున్న భర్తనే తన భార్య లంచకుందిరాలు తనని పట్టుకోండని పోలీసులను కోరుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే
రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపల్ డీఈఈ దివ్యజ్యోతిపై కట్టుకున్న భర్తే అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో తన భార్య జ్యోతి ప్రతి రోజూ లంచం తీసుకుంటుందంటూ ఇంట్లో గుట్టలు గుట్టలుగా ఉన్న డబ్బుల వీడియోలను ఆమె భర్త విడుదల చేశారు. ఇంట్లో డబ్బుల్ని దాచిన ప్రతి చోటు చూపిస్తూ వీడియోల్ని విడుదల చేశారు. భార్య చేస్తున్న తప్పును తట్టుకోలేక ఈ వీడియోలు తీసినట్లు తెలిపారు.