Kadapa

Kadapa: భార్య బతికి ఉండగానే ‘చనిపోయినట్లు’ ఫేక్ సర్టిఫికెట్ పంపిన భర్త.. కడపలో వింత కేసు!

Kadapa: వైఎస్సార్ కడప జిల్లాలోని ముద్దనూరులో ఇటీవల ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఇంట్లో చిన్నపాటి గొడవలు జరగడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇదే కారణంతో, ఆదిలక్ష్మి అనే భార్య తన భర్తకు చెప్పకుండానే దాదాపు నెల రోజుల కిందట పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తిరిగి కాపురానికి రాకపోవడంతో భర్త మారుతికి కోపం, చిరాకు ఎక్కువయ్యాయి.

ఈ కోపాన్ని తట్టుకోలేక మారుతి ఒక వింత పనికి పూనుకున్నాడు. భార్యను భయపెట్టాలని లేదా ఏదో విధంగా ఆమెను బాధపెట్టాలనే ఉద్దేశంతో, ఏకంగా ఆమె పేరు మీద మరణ డెత్ సర్టిఫికెట్ తయారు చేయించాడు. అంతేకాక, దానిని పోస్టు ద్వారా ఆమె పుట్టింటి అడ్రస్‌కు పంపాడు.

తాను బతికి ఉండగానే, తన పేరు మీద మరణ ధ్రువీకరణ పత్రం రావడంతో ఆదిలక్ష్మి తీవ్ర ఆందోళనకు గురైంది. తన భర్త చేసిన ఈ వింత చర్యతో షాక్ తిన్న ఆమె, వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మారుతిని పిలిచి విచారించగా, అసలు విషయం బయటపడింది. మారుతి తన తల్లికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్‌ను తీసుకుని, దానిపై ఉన్న పేరును మార్చి తన భార్య ఆదిలక్ష్మి పేరుతో పంపినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. కాపురానికి రమ్మని భార్యను బెదిరించడానికి, భయపెట్టడానికే ఈ పని చేసినట్లు మారుతి తెలిపాడు. ఈ వింత ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *