Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా, శివ రాజ్కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఫస్ట్ షాట్తోనే అంచనాలు పెంచిన ఈ చిత్రంలో రామ్ చరణ్పై ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ ట్రైన్ ఎపిసోడ్ సినిమాలోని హైలైట్ సీన్గా నిలవనుందని, రామ్ చరణ్ యాక్షన్ అదిరిపోనుందని సమాచారం. ఈ సన్నివేశం పెద్ద తెరపై ఆడియన్స్కు విజువల్ ట్రీట్గా ఉంటుందని టాక్. ఏ ఆర్ రెహమాన్ సంగీతం, వృద్ధి సినిమాస్ నిర్మాణంతో ఈ చిత్రం అంచనాలను మరింత పెంచుతోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి!
