Tirumala

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి 12 గంటలు సమయం

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఈరోజు కూడా కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది.

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం 30 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు స్వామివారి దర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది.

రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు నిరంతరాయంగా అందిస్తున్నారు.

ఈ రద్దీ వారాంతాల్లో, పండుగ రోజుల్లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తిరుమల యాత్రకు ప్లాన్ చేసుకునే భక్తులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AP News: సామాజిక పింఛ‌న్ ల‌బ్ధిదారుల‌కు శుభ‌వార్త‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *