HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరి హర వీరమల్లు సినిమా చుట్టూ చర్చలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ సినిమా రిలీజ్ అవుతున్నందున అభిమానుల్లో భారీ హంగామా నెలకొంది.
నష్టపరిహారం వివాదం.. రిలీజ్కు సస్పెన్స్?
నిర్మాత ఏ.ఎం.రత్నం గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. ఆ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన బయ్యర్లు తమ నష్టాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ లేఖలు పంపారు. దీంతో నైజాం ఏరియాలో రిలీజ్ ఆగిపోతుందా? అన్న సందేహాలు మొదలయ్యాయి.
ఇది కూడా చదవండి: Kubera: ‘కుబేర’ సినిమా పైరసీపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
పవన్ ఇమేజ్ కాపాడేందుకు బడా నిర్మాతల యూనిటీ
ఈ వివాదం పెద్దదిగా మారకముందే టాలీవుడ్లోని ముగ్గురు టాప్ నిర్మాతలు రంగంలోకి దిగి సమస్య పరిష్కరించారు.
-
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కీలక పాత్ర పోషిస్తూ అన్ని వివాదాలు సర్దుబాటు చేసింది.
-
మైత్రి మూవీస్ నైజాం ఏరియాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకొచ్చింది.
-
సితార ఎంటర్టైన్మెంట్స్ ఆంధ్ర ఏరియాలో రిలీజ్ బాధ్యతలు తీసుకుంది.
పవన్ కోసం ఈ ప్రయత్నమంతా?
పవన్తో సత్సంబంధాలు ఉన్న ఈ ముగ్గురు నిర్మాతలు కేవలం వ్యాపారం కోసం కాదు, పవన్ ఇమేజ్ను కాపాడేందుకే ముందుకు వచ్చారని ఇండస్ట్రీ టాక్. పవన్ సినిమా రిలీజ్ ఆలస్యం అవ్వకుండా, అభిమానుల అంచనాలకు తగినట్లుగా థియేటర్లలోకి రావడమే లక్ష్యమని చెబుతున్నారు.