Rajanna Sircilla: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రోటోకాల్ పాటించనందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝాపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ప్రభుత్వం కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది.
ప్రోటోకాల్ ఉల్లంఘనపై వివరణ కోరిన ప్రభుత్వం
ప్రజాపాలన దినోత్సవంలో ప్రోటోకాల్ను ఉల్లంఘించారని కలెక్టర్ సందీప్కుమార్ ఝాపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. దీనిపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కలెక్టర్కు నోటీసులు పంపింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నోటీసుతో జిల్లా యంత్రాంగంలో చర్చ మొదలైంది.