Gold Price Today

Gold Price Today: పసిడి పరుగు.. వెండి హోరు.. తెలుగు రాష్ట్రాల్లో నేడు తులం ఎంతంటే?

Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి చేదువార్త. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ ధరల పెరుగుదల సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

తాజా గణాంకాల ప్రకారం, నిన్న ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 700 రూపాయల వరకు పెరిగింది. వెండి ధర కూడా ఇదే బాటలో పయనిస్తూ ఏకంగా 10 వేల రూపాయలకు పైగా ఎగబాకింది. మార్చి నెలలో ఇప్పటివరకు ధరలు తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్న కొనుగోలుదారులకు, తాజా పెరుగుదల పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే:
మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడల్లో ధరలు ఒకేలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ప్రస్తుతం 1,62,390 రూపాయలుగా ఉంది. అలాగే, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,860 రూపాయలకు చేరుకుంది.

దేశంలోని ఇతర నగరాల్లో పరిస్థితి:
దేశవ్యాప్తంగా చూస్తే చెన్నైలో బంగారం ధరలు అత్యధికంగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర 1,64,190 రూపాయలుగా పలుకుతోంది. ఢిల్లీలో 1,62,540 రూపాయలు ఉండగా, ముంబై మరియు బెంగళూరు నగరాల్లో హైదరాబాద్ తరహాలోనే 1,62,390 రూపాయల వద్ద ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ధరల జోరు:
బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర 3 లక్షల రూపాయల మార్కును తాకింది. ఇతర ప్రధాన నగరాల్లో కిలో వెండి సుమారు 2,90,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం, వెండి కొనాల్సిన వారు ఈ ధరల పెరుగుదలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *