Nara Lokesh

Nara Lokesh: గణేష్‌ మండపాలకు ఉచిత విద్యుత్‌..

Nara Lokesh: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా గణేశ్‌ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా పలువురు ఉత్సవ నిర్వాహకులు మంత్రి నారా లోకేశ్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. గణేశ్‌ మండపాలకు ఉచిత విద్యుత్‌ అందించాలని చేసిన విజ్ఞప్తికి లోకేశ్‌ వెంటనే స్పందించి సీఎం చంద్రబాబు, విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో చర్చించారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల గణేశ్‌ విగ్రహాలను ప్రతిష్టించనుండగా, పండుగ కాలంలో మండపాలకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడానికి దాదాపు రూ.25 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అయితే భక్తుల సౌలభ్యం దృష్ట్యా ప్రభుత్వం ఈ ఖర్చును భరించేందుకు సిద్ధమైంది.

ఇది కూడా చదవండి: Atchannaidu: ఏపీలో రైతులకు ఎరువుల కొరత ఉండదు: మంత్రి అచ్చెన్నాయుడు

ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రత్యేక జీవో విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక, రాబోయే విజయదశమి సందర్భంగా ఏర్పాటుచేసే దుర్గాదేవి మండపాలకు కూడా ఉచిత విద్యుత్‌ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mumbai: పవన్ ఎఫెక్ట్.. ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *