Chirala: బాపట్ల జిల్లా చీరాలలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. చీరాల మండలం ఈపూరుపాలెంలోని ఏపీ మోడల్ స్కూల్, కస్తూరిబాయ్ గాంధీ బాలికల పాఠశాల, జాండ్రపేట హైస్కూలు చౌక డిపోలు, పౌరసరఫరాల గోడౌన్ లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో విద్యార్థులకుకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు అందించడంలో లోపాలను గుర్తించడం జరిగిందని, ఏపీ మోడల్ స్కూల్ లో గత ప్రభుత్వంలో నాడు నేడు పథకం ద్వారా నిర్మించిన మంచినీటి ప్లాంట్ నిరుపయోగంగా ఉందనిగుర్తించడం జరిగిందని వీటి ఫై స్కూల్ హెడ్మాస్టర్లకు మెమోలను జారీ చేయడం జరుగుతుందని మానవతా దృక్పథంతో ప్రతి ఒక్క హెడ్మాస్టర్లు, హాస్టల్వార్డెన్ లు విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించాలని ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి తెలిపారు.
