Hyderabad: హైదరాబాదులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని మాదాపూర్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శనివారం తెల్లవారుజామున మాదాపూర్లోని ఇనార్బిట్మాల్ ఎదురుగా ఉన్న సత్యభవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బిల్డింగ్లో ఉన్న ఐదంతస్తులకు వ్యాపించాయి.దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా మంటలు అలముకున్నాయి. ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. వెంటనే ఫైర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.
