Tollywood

Tollywood: ముగిసిన సినీ కార్మికుల సమ్మె.. నేటి నుంచి షూటింగులు ప్రారంభం

Tollywood: గత 18 రోజులుగా టాలీవుడ్‌ను స్థంభింపజేసిన సినీ కార్మికుల సమ్మెకు చివరికి ముగింపు పలికింది. ఎన్నో రోజులు సవాళ్లు, చర్చలు, వాదోపవాదాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో సమస్యకు పరిష్కారం లభించింది. నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు, కార్మికశాఖ అదనపు కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి.

వేతనాల పెంపు – కొత్త నిర్ణయాలు

  • ₹2,000 లోపు వేతనం పొందే కార్మికులకు వచ్చే మూడు సంవత్సరాల పాటు 22.5% పెంపు అమలు చేయనున్నారు.

  • ₹2,000 నుండి ₹5,000 వరకు వేతనం పొందేవారికి మూడు సంవత్సరాలకు 17.5% వేతన పెంపు మంజూరు చేశారు.

  • నిర్మాతలు కోరిన 9 AM – 9 PM కాల్‌షీట్ విధానానికి ఫెడరేషన్ నాయకులు అంగీకారం తెలిపారు.

  • డాన్సర్స్‌, ఫైటర్స్‌, టెక్నీషియన్ల వేతనాల పెంపుపై కూడా సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు.

ఆదివారాలపై స్పష్టత

  • పెద్ద బడ్జెట్ సినిమాలకు: ప్రతి ఆదివారం 1.5 కాల్‌షీట్.

  • చిన్న సినిమాలకు: రెండో, నాలుగో ఆదివారాల్లో 1.5 కాల్‌షీట్ – మిగతా ఆదివారాల్లో సింగిల్ కాల్‌షీట్.

షూటింగ్ లకు కొత్త ఊపు

ఈ ఒప్పందం కుదిరిన వెంటనే టాలీవుడ్ మళ్లీ సందడిగా మారింది. తెల్లవారుజామునుంచే కృష్ణానగర్ పరిసరాలు షూటింగ్ వాతావరణంతో కోలాహలంగా కనిపించాయి. జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఇతర విభాగాల కార్మికులు మళ్లీ బిజీగా మారారు. గత షెడ్యూల్‌లో ఆగిపోయిన సినిమాలు వెంటనే తిరిగి మొదలయ్యాయి. కొంతమంది మేకర్స్ అయితే బ్రేక్ లేకుండా నిరవధికంగా షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కొందరికి అసంతృప్తి

ఒప్పందం కుదిరినా, ఈ చర్చలపై కొంతమంది సినీ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ, పెద్ద మొత్తంలో కార్మికులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Atma Katha: పూజా కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా "ఆత్మ కథ" చిత్ర ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *