Virat Kohli: టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే విరాట్ కోహ్లీకి ఒక పెద్ద ఆఫర్ వచ్చింది. విశేషమేమిటంటే అది కూడా ఇంగ్లాండ్ నుంచే. టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీని కౌంటీ క్రికెట్లో బరిలోకి దించాలని మిడిల్ఎక్స్ క్లబ్ చూస్తోంది. ఈ తరంలో అత్యంత ప్రసిద్ధ ఆటగాడు విరాట్ కోహ్లీ. కాబట్టి మా క్లబ్ తరపున అతను ఫీల్డ్లో ఉండటం పట్ల మేము సంతోషిస్తున్నాము.దీనిపై చర్చలు జరపడానికి మేము ఆసక్తిగా ఉన్నాము అని మిడిల్ఎక్స్ క్రికెట్ డైరెక్టర్ అలాన్ కోల్మన్ అన్నారు. మిడిల్ఎక్స్ అధికారులు విరాట్ కోహ్లీని కౌంటీ క్రికెట్కు తీసుకురావడానికి అయ్యే ఖర్చును పంచుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. అందువల్ల ముందుగా కోహ్లీతో చర్చలు జరుగుతాయి. తన డిమాండ్లను బట్టి బిగ్ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది.
ఆఫ్-సీజన్ సమయంలో లండన్లో కనిపించే విరాట్ కోహ్లీ మిడిల్ఎక్స్ క్లబ్తో ఒప్పందం కుదుర్చుకుంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఈ ఏడాది టీమిండియా తరపున 9 మ్యాచ్లు మాత్రమే ఆడతాడు. అంటే టీ20, టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ లలో మాత్రమే కనిపిస్తాడన్నమాట. దీని ప్రకారం వారు ఈ ఏడాది బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో 9వన్డేలు మాత్రమే ఆడతారు.
Also Read: RCB : ఆర్సీబీ టాప్ 2లో ఉండాలంటే అలా జరగాలి
Virat Kohli: ఈ మూడు సిరీస్లు మినహా విరాట్ కోహ్లీ మిగితా టైమంతా ఫ్రీగా ఉంటాడు. కాబట్టి కింగ్ కోహ్లీ తన విరామ సమయంలో కౌంటీ క్రికెట్లో కనిపిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో, మిడిల్ఎక్స్ క్లబ్ కింగ్ కోహ్లీని కౌంటీ క్రికెట్కు పరిచయం చేయాలని చూస్తోంది. ఆ విధంగా MCC కౌంటీ ఛాంపియన్షిప్ను ప్రపంచ క్రికెట్కు కేంద్ర బిందువుగా మార్చడానికి ఒక ప్రణాళికను రూపొందించింది. ఈ ప్లాన్ విజయవంతమవుతుందా? మరి, విరాట్ కోహ్లీ మిడిల్ఎక్స్ తరపున కౌంటీ క్రికెట్ ఆడతాడా అనేది వెయిట్ అండ్ సీ.

