Encounter:

Encounter: బీజాపూర్ అడ‌వుల్లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 20 మంది మావోల‌ హ‌తం.. ఒక‌రు జ‌వాన్ క‌న్నుమూత‌

Encounter:ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలో మ‌ళ్లీ కాల్పుల మోత సంచ‌ల‌నం రేపుతున్న‌ది. తాజాగా జ‌రిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 20 మంది వ‌ర‌కు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఒక పోలీస్ జ‌వాన్ కూడా ప్రాణాలు కోల్పోయిన‌ట్టు బీజాపూర్ పోలీసులు వెల్ల‌డించారు. ఈ భీక‌ర ఎన్‌కౌంట‌ర్ గురువారం ఉద‌యం జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

Encounter:ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలోని బీజాపూర్‌-దంతేవాడ స‌రిహ‌ద్దుల్లో గురువారం ఉద‌యం భ‌ద్ర‌తా బ‌ల‌గాలు న‌క్స‌ల్స్ ఏరివేత కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో అండ్రి అట‌వీ ప్రాంతంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు కూంబింగ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతుండ‌గా, తెల్ల‌వారుజామున 7 గంట‌ల‌కు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మావోయిస్టుల మ‌ధ్య భీక‌ర ఎదురు కాల్పులు జ‌రిగాయి.

Encounter:ఈ ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హ‌త‌మ‌వ‌గా, ఘ‌ట‌నా స్థ‌లం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్న‌ట్టు బీజాపూర్ పోలీసులు తెలిపారు. భ‌ద్ర‌తా సిబ్బంది ఒక‌రు ప్రాణాలిడిచిన‌ట్టు తెలిపారు. ప్ర‌స్తుతం అదే ప్రాంతంలో ఇంకా ఆప‌రేష‌న్ కొనసాగుతున్నట్టు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 28 మంది మావోయిస్టులు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *