Ec: కేవలం రెండు రాష్ట్రాల్లోనే 1.70 కోట్ల ఓట్ల తొలగింపు

Ec : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision – SIR)లో భాగంగా ఎన్నికల సంఘం భారీ స్థాయిలో ఓట్లను తొలగించింది. ఈ ప్రక్రియలో ముఖ్యంగా తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో ఓట్లు జాబితా నుంచి తొలగించబడడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడులో మొత్తం 97.37 లక్షల ఓట్లు తొలగించబడినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 6.41 కోట్ల నుంచి 5.43 కోట్లకు తగ్గింది. తొలగించిన ఓట్లలో 26.94 లక్షలు మరణించినవారి పేర్లు, 66.44 లక్షలు శాశ్వత వలస వెళ్లినవారి ఓట్లు, అలాగే 3.39 లక్షలు డూప్లికేట్ ఓట్లుగా గుర్తించారు.

ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొలత్తూర్ నియోజకవర్గంలోనే 1.03 లక్షల ఓట్లు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ నియోజకవర్గంలో 89 వేల ఓట్లు తొలగించబడటం విశేషం. చెన్నై నగరంలో అత్యధికంగా 14.25 లక్షల ఓట్లు, కోయంబత్తూరులో 6.5 లక్షల ఓట్లు తొలగించా

ఇదే తరహాలో గుజరాత్‌లో 73.73 లక్షల ఓట్లు తొలగించగా, అక్కడ ఓటర్ల సంఖ్య 5.08 కోట్ల నుంచి 4.34 కోట్లకు పడిపోయింది. గతంలో పశ్చిమ బెంగాల్‌లో కూడా 58 లక్షల ఓట్లు తొలగించినట్లు ఈసీ వెల్లడించింది.

ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, సవరణల కోసం జనవరి 18 వరకు అవకాశం ఇచ్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో voters.eci.gov.in వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించింది. meanwhile, కేరళ, ఉత్తరప్రదేశ్‌లలో సవరణ గడువు పొడిగింపుపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలించాలని సుప్రీంకోర్టు ఈసీకి సూచించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *