Dubai: దుబాయ్లో జరుగుతున్న అంతర్జాతీయ ఎయిర్ షోలో శనివారం తీవ్రమైన ప్రమాదం చోటుచేసుకుంది. భారత వాయుసేనలో సేవలందిస్తున్న తేజస్ యుద్ధ విమానం ప్రదర్శన సమయంలోనే కుప్పకూలింది. మధ్యాహ్నం 2:10 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోగా, విమానం నేలపై పడిన వెంటనే భారీగా మంటలు, పొగలు ఎగసిపడ్డాయి.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే రక్షక బృందాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే, ఇప్పటికీ ఆ విమానాన్ని నడిపిన పైలట్ ఆచూకీ దొరకలేదని అధికారులు తెలిపారు. పైలట్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తగ్గిన బరువుతో, అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన తేజస్ యుద్ధ విమానం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే తయారైంది. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ಲిమిటెడ్ (HAL) సంస్థలో ఈ యుద్ధవిమానాన్ని అభివృద్ధి చేశారు. దేశ రక్షణ సామర్థ్యానికి ప్రతీకగా భావించే తేజస్ విమానం ఇలాంటి అంతర్జాతీయ వేదికపై ప్రమాదానికి గురవ్వడంతో రక్షణ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అపఘాతానికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. బ్లాక్ బాక్స్ కోసం శోధనలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై దుబాయ్ అధికారులు మరియు భారత రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త దర్యాప్తు చేపట్టనున్నాయి.

