తెలంగాణ డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. డీఎస్సీ అభ్యర్థుల కౌన్సిలింగ్ ను వాయిదా వేసినట్టు ప్రకటించింది విద్యాశాఖ. ఈరోజు నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ ను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. త్వరలో కొత్త కౌన్సిలింగ్ డేట్ లను ప్రకటిస్తామని తెలిపింది.
కాగా, తెలంగాణలో డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన 10,006 మంది కొత్త టీచర్లకు అక్టోబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. కౌన్సిలింగ్ డేట్లు వాయిదా వేయడంతో నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులకు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.