Dhanush-Kriti Sanon: బాలీవుడ్లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్న చిత్రం ‘తేరే ఇష్క్ మే’ షూటింగ్ పూర్తయింది. ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ డ్రామా, ‘రాంఝణా’కు ఆధ్యాత్మిక సీక్వెల్గా రూపొందింది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, హిమాన్షు శర్మ స్క్రీన్ప్లేతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఢిల్లీ, బెనారస్, లేహ్-లడఖ్లలోఈ సినిమా చిత్రీకరణ జరిగింది.
Also Read: Peddi: పెద్దిపై కొండంత హైపెక్కించిన రామ్ చరణ్.. కామెంట్స్ వైరల్!
Dhanush-Kriti Sanon: షూటింగ్ పూర్తి కావడంతో కృతి సనన్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ ద్వారా షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. ధనుష్ను ఉత్తమ, తెలివైన నటుడిగా ఆమె ప్రశంసించారు. నవంబర్ 28న హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ప్రేమ, భావోద్వేగాలు, సామాజిక అంశాల మేళవింపుతో ప్రేక్షకులను అలరించనుంది.
View this post on Instagram