Deputy CM Pawan Kalyan: భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినట్టు అధికారికంగా ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. నీతిఆయోగ్ ఈ విషయాన్ని ప్రకటించగా, దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ ఈ విజయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి, ఎన్డీయే ప్రభుత్వ ముందడుగు పాలనకు నిదర్శనంగా అభివర్ణించారు.
పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదిక అయిన ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ, “గత పదేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం దేశాన్ని వివిధ రంగాల్లో అభివృద్ధిపథంలో నడిపింది. ఇది కేవలం ఆర్థిక రంగానికి మాత్రమే పరిమితమైన విజయమేం కాదు. ఇది నూతన భారతానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గౌరవానికి సూచన” అన్నారు.
ప్రస్తుతం భారత్ జీడీపీ (GDP) విలువ సుమారు $4.18 ట్రిలియన్ డాలర్లు, ఇది దేశాన్ని నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపింది. అమెరికా, చైనా, జపాన్ల తరువాత భారత్ ఈ స్థానాన్ని సాధించడం గమనార్హం.
Also Read: Pawan Kalyan: ప్రభుత్వంపై మీకు కృతజ్ఞత లేదా.. డిప్యూటీ సీఎం పవన్
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా “ఇది వికసిత్ భారత్ 2047 లక్ష్యం వైపు తీసుకెళ్లే కీలకమైన మైలురాయిగా” అభివర్ణించారు. దేశం మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారేందుకు ఇది ఓ ముందడుగు అని ఆయన అన్నారు. ఈ అభివృద్ధి దేశ ప్రజల కృషికి, ప్రభుత్వ వ్యూహాత్మక దృక్పథానికి ఫలితమని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ ఆర్థిక ప్రగతిలో తీసుకుంటున్న వేగం, భవిష్యత్తులో మరింత పురోగతికి బలమైన ఆధారంగా నిలుస్తుందనే విశ్వాసం వ్యక్తమవుతోంది.
Congratulations, Bharat 🇮🇳
India has successfully emerged as the world’s fourth largest economy, with a GDP of $4.18 trillion, according to @NITIAayog. This historic achievement demonstrates Hon’ble PM Sri @narendramodi Ji’s visionary leadership and the NDA Government’s… pic.twitter.com/TKXDSbMbUB
— Pawan Kalyan (@PawanKalyan) May 25, 2025
