Delhi Red Fort Car Blast

Delhi Red Fort Car Blast: ఢిల్లీ పేలుడుకు పుల్వామాకు లింక్

Delhi Red Fort Car Blast: ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) సమీపంలో సోమవారం సాయంత్రం 6:52 గంటలకు జరిగిన హ్యుందాయ్ ఐ20 కారు పేలుడు ఘటనపై పోలీసులు, ఫోరెన్సిక్ (FSL), ఎస్‌పీజీ (SPG), ఎన్‌ఎస్‌జీ (NSG), ఏటీఎస్ (ATS) బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ కేసులో జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంతో సంబంధం ఉన్నట్లుగా తేలడం సంచలనం సృష్టించింది.

పేలుడు కారుకు పుల్వామా లింక్

పేలుడుకు కారణమైన హ్యుందాయ్ ఐ20 కారు (నెంబర్: HR 26 CE 7674) చిట్టచివరి సారిగా పుల్వామాకు చెందిన తారిఖ్‌ దీన్ని కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్న డాక్టర్ ముజామిల్ షకీల్ అరెస్టు కాగా, అతడితో పాటు తారిఖ్‌ కూడా మాడ్యూల్‌లో భాగమని దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. కారు మునుపటి యజమాని అయిన సల్మాన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, వాహనాన్ని కొనుగోలు చేసిన తారిఖ్‌ను కూడా అధికారులు అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: Delhi Bomb Blast: బ్లాస్ట్ కి ముందు.. 3 గంటల పాటు నిలిపిన కారు.. CCTV లో రికార్డు

కారు కొనుగోలు, అమ్మకాలలో నకిలీ పత్రాలను ఉపయోగించినట్లు సమాచారం అందుతోంది. వాహనం నిజమైన యజమానిని గుర్తించడానికి పోలీసులు ఆర్‌టీఓ (RTO)తో కలిసి పనిచేస్తున్నారు.పేలుడుకు కొద్ది క్షణాల ముందు కారు నడుపుతున్న దృశ్యాలను అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్న వైద్యుడు మహ్మద్‌ ఉమర్‌గా అనుమానిస్తున్నారు.

అమిత్ షా కీలక ప్రకటన – ఇది ఉగ్రదాడి కాదనే కోణం

ఘటనా స్థలాన్ని, ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.కారు పేలుడు వెనుక ఉన్న ప్రతి కోణాన్ని పరిశీలిస్తున్నామని, అయితే, ఇది ఉగ్రవాద దాడినా కాదా అనే దానిపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని షా అన్నారు. పేలుడు స్థలంలో ఎలాంటి గుంతలు ఏర్పడలేదని (బాంబు పేలుళ్లకు సాధారణ సూచిక), ఆర్డీఎక్స్ వాడిన ఆనవాళ్లు లభించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన తెలిపారు.

గత ఉగ్రవాద దాడుల మాదిరిగా బాధితుల ముఖం కాలిన గాయాలు లేదా పేలుడు అవశేషాల వల్ల నల్లబడిన సంకేతాలు కనిపించలేదని, ఇది మునుపటి ఉగ్రవాద సంఘటనలకు సారూప్యతలను కలిగి లేదని షా గుర్తించారు. పేలుడు స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న నమూనాలను FSL, NSG విశ్లేషణకు పంపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని, ఏ కోణాన్ని మూసివేయబోమని షా స్పష్టం చేశారు.

తక్షణ చర్యలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మంగళవారం (నవంబర్ 11, 2025) ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరుగుతుంది. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి  UAPA సెక్షన్లు (16, 18) తో పాటు హత్య మరియు హత్యాయత్నం అభియోగాలను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. బాధితుల గుర్తింపునకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు. భద్రత దృష్ట్యా చాందినీ చౌక్ మార్కెట్ మంగళవారం మూసివేయబడుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *