Delhi: ISI కి ఇన్ఫర్మేషన్ లీక్..24 గంటల్లో భారత్ వదిలి పోవాలి..

Delhi: భారతదేశ భద్రతను పక్కాగా రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌ హైకమిషన్‌లో ఉద్యోగిగా పని చేస్తున్న రెహమాన్‌పై భారత్‌ చర్యలు తీసుకుంది. ఆయన్ను రాయబార కార్యాలయంలో ఉండే అర్హతలేని వ్యక్తిగా ప్రకటించి, 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది.

అసలు విషయంలోకి వెళితే, పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI) కోసం రెహమాన్ పని చేస్తున్నట్లు భారత గూఢచర్య సంస్థలు గుర్తించాయి. రాయబార కార్యాలయ ఉద్యోగిగా ఉండే ముసుగులో, గూఢచర్యం చేస్తూ భారత సైన్యానికి చెందిన కీలక సమాచారాన్ని ISIకి చేరవేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

అంతేకాకుండా, రెహమాన్ డానిష్ అనే మారుపేరుతో భారత భూభాగంలో పలు నిఘా కార్యకలాపాలకు పాల్పడ్డాడని సమాచారం. ఈ నేపథ్యంలో, భారత ప్రభుత్వం అతన్ని అస్వీకృత వ్యక్తిగా ప్రకటించి, దేశం నుంచి బయటకు పంపుతోంది.

ఈ ఘటన పాకిస్థాన్ నిఘా యంత్రాంగం భారత వ్యవహారాల్లో తలదూర్చే యత్నాలకు మరోసారి నిదర్శనంగా నిలుస్తోంది. దేశ భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి శక్తినైనా భారత్ తట్టుకోగలదని, తీవ్ర చర్యలు తీసుకునేందుకు వెనుకాడదని ఈ చర్య స్పష్టంగా సూచిస్తోంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Narayana: అమరావతి పునఃనిర్మాణానికి రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *