Delhi: టాప్ లష్కరే తొయిబా ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ హతం

Delhi: పాక్‌లో ఉన్న లష్కరే తొయిబా టాప్ కమాండర్, తీవ్రవాది సైఫుల్లా ఖలీద్ గుర్తుతెలియని దుండగుల చేతిలో కాల్చి చంపబడ్డాడు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ లోని బాదిక్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఖలీద్ గత కొంతకాలంగా అక్కడే మకాం మార్చి నివసిస్తున్నట్టు సమాచారం.

ఉగ్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర

సైఫుల్లా ఖలీద్ చాలా కాలంగా నేపాల్లో ఉంటూ లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు కీలకంగా పని చేశాడు. లష్కరే సంస్థకు చెందిన లాంచ్ కమాండర్లతో కలిసి భారత్‌లోకి ఉగ్రవాదులను చొరబాటు చేయడంలో అతని పాత్ర గణనీయమైనది. ప్రత్యేకంగా నేపాల్ నుంచి భారత్‌లోకి చొరబాటుకు సాయపడే కార్యకలాపాలలో అతడు చురుకుగా ఉండేవాడు.

భారత్‌పై దాడుల్లో కీలక నిందితుడు

సైఫుల్లా ఖలీద్ భారత్‌పై జరిగిన పలు ఉగ్రదాడుల వెనుక కీలక పాత్ర వహించాడు.

2006లో నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో అతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

2005లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) క్యాంపస్ పై జరిగిన దాడి వెనుక కూడా ఖలీద్ పాత్ర ఉన్నట్టు విచారణలో తేలింది.

2001లో రాంపూర్ సీఆర్పీఎఫ్ క్యాంప్ పై జరిగిన దాడిలోనూ అతను ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

పలు ఉగ్రకోణాల వెనుక అతని ప్రమేయం ఉండటంతో, అతని మృతి లష్కరే తొయిబా సంస్థకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఖలీద్‌ను హతమార్చిన వారెవరనేది ఇంకా అర్ధం కాలేదు. కానీ ఇది ఉగ్రవాదుల మధ్య అంతర్గత పోరు కావచ్చని అనుమానిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *