Delhi: టెలికాం రంగానికి ఊరటనిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వొడాఫోన్–ఐడియా (Vi) సంస్థకు పెద్ద ఊరట కలిగేలా, కంపెనీపై ఉన్న రూ.87,695 కోట్ల AGR (Adjusted Gross Revenue) బకాయిలను ఫ్రీజ్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయంతో వొడాఫోన్–ఐడియా సంస్థకు ఆర్థిక భారం కొంత మేర తగ్గనుంది. తాజా కేబినెట్ నిర్ణయం ప్రకారం, 2023 నుంచి 2041 వరకు విడతలుగా రూ.87,695 కోట్ల AGR బకాయిలను చెల్లించే వెసులుబాటు కల్పించారు. దీంతో తక్షణ నగదు ఒత్తిడి నుంచి కంపెనీకి ఊరట లభించనుంది.
టెలికాం రంగం తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. వొడాఫోన్–ఐడియా కార్యకలాపాలు కొనసాగించేందుకు, నెట్వర్క్ విస్తరణకు ఈ నిర్ణయం దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో టెలికాం రంగంలో స్థిరత్వం నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
