Dangerous Dogs: జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి… మీ గ్రామంలోని కుక్కలు నరమాంస భక్షకులుగా మారాయి. అవి దాడులు చేస్తున్నాయి. మీరందరూ ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడల్లా, చేతిలో ఒక కర్ర పట్టుకోండి… ఈ కుక్కలు గుంపులుగా జీవిస్తాయి. ఎవరైనా ఒంటరిగా , నిరాయుధంగా కనిపిస్తే దాడి చేస్తాయి అంటూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్ జిల్లా యంత్రాంగం ప్రతి గ్రామంలో ఈ ప్రకటన చేస్తోంది.
తోడేళ్ళు, చిరుతల తర్వాత, ఇప్పుడు బహ్రైచ్లో కుక్కల భయం నెలకొంది. ఖైరిఘాట్ ప్రాంతంలోని శివ్పూర్ బ్లాక్లోని నాలుగు గ్రామాలైన మతేరా కాలా, బక్షిపుర, రఖునా, ఖైరిఘాట్ గ్రామస్తులు భయపడుతున్నారు. పిల్లలు బడికి వెళ్ళలేకపోతున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. గ్రామాల్లో నిశ్శబ్దం అలుముకుంది. వాళ్ళు ఇంటి నుండి బయటకు వెళ్లినా, గుంపుగా బయటకు వెళుతున్నారు. అది కూడా చేతుల్లో కర్రలు, గొడ్డలి పట్టుకుని.
Also Read: Tariff on Mexico: మెక్సికో దిగుమతులపై సుంకాల విధింపును ఏప్రిల్ 2 వరకు వాయిదా వేసిన ట్రంప్
Dangerous Dogs: కుక్కలు పిల్లల పట్ల దూకుడుగా ఉంటున్నాయి. సిబ్బంది కుక్కలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంకా విజయం సాధించలేదు. ప్రజలను వీధి కుక్కల విషయంలో జాగ్రత్తగా ఉండాలని లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటనలు చేస్తున్నారు. గత 10 రోజులుగా, 4 వేర్వేరు గ్రామాల్లో కుక్కలు దాడి చేస్తున్నాయి. ఒక నాలుగేళ్ల బాలుడిపై తీవ్రంగా దాడి చేయడంతో అతను మరణించాడు.
నాలుగు గ్రామాల్లో పిల్లలతో సహా 15 మందికి పైగా గాయపడ్డారు. కుక్కలను పట్టుకోవడానికి ఇక్కడ ఒక ఉచ్చును ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, కుక్కలను పట్టుకోవడం వీలు కావడం లేదు. భీభత్సం పెరుగుతున్నట్లు గమనించిన యంత్రాంగం లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తోంది.