Crime News: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మోరాదాబాద్ జిల్లా మైనాథేర్ గ్రామంలో ఓ అమాయక యువతిపై జరిగిన హృదయ విదారక సంఘటన అందరినీ కదిలిస్తోంది. ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో ఒక యువకుడు తన కోపాన్ని హద్దలు దాటి ప్రదర్శించాడు. ఈ కేసులోని వివరాలు తిలియగానే ప్రజలు షాక్కు గురయ్యారు.
శనివారం నుంచి అదృశ్యమైన సైరా
సైరా అనే యువతి శనివారం రోజు పశువుల కోసం మేత తెచ్చేందుకు తన గ్రామంలోని పొలాలకు వెళ్లింది. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు ఎక్కడికక్కడ వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. ఆదివారం ఉదయం, గ్రామ శివారులో ఉన్న పొలాల్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
అధిక సంఖ్యలో గాయాలు, షాకింగ్ వివరాలు
పోలీసుల ప్రకారం, సైరా శరీరంపై దాదాపు 18 సార్లు స్క్రూ డ్రైవర్తో గాయాల ముద్రలు కనిపించాయి. ఇది ఒక ఉద్ధృతంగా, పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు అంచనా వేస్తున్నారు. మొదట ఆమెపై అత్యాచారానికి గురైనట్టు అనుమానించినా, పోస్టుమార్టం నివేదికలో అత్యాచారం జరగలేదని తేలింది.
ఇది కూడా చదవండి: virat kohli Pub: విరాట్ కోహ్లీ పబ్పై కేసు.. అందుకేనా?
మిస్డ్ కాల్స్.. విచారణలో కీలక ఆధారాలు
పోలీసులు ఆమె మొబైల్ను చెక్ చేయగా, ఐదు మిస్డ్ కాల్స్ కనిపించాయి. ఆ నంబర్ను ట్రేస్ చేయగా, అదే గ్రామానికి చెందిన రఫీ అనే యువకుడికి చెందినదని గుర్తించారు. గత కొంతకాలంగా రఫీ ఆమెను వెంటాడుతున్నట్టు, తరచూ కాల్స్ చేసి వేధించేవాడని, సైరా తల్లి సఫీనా ఫిర్యాదు ఇచ్చారు.
ప్రేమలో విఫలం.. కసితో హత్య
రఫీని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా, అతను తన తప్పును ఒప్పుకున్నాడు. సైరాను ప్రేమించానని, కానీ ఆమె తనను తిరస్కరించిందని చెప్పాడు. అంతేగాక, కొన్ని రోజుల క్రితం సైరా, గ్రామంలోని మరో వ్యక్తితో కలిసి తనపై దాడికి పాల్పడేలా చేశిందని అనుమానం వ్యక్తం చేశాడు. అదే కసితో, రెండు రోజుల పాటు సైరాను ఫాలో చేసి , అవకాశం చూసి స్క్రూ డ్రైవర్తో దాడి చేశాడని అంగీకరించాడు.
హత్య తర్వాత సిగ్గు లేకుండా ఇంటికి వెళ్లిన రఫీ
హత్య చేసిన తర్వాత రఫీ చలించలేదు. అతను ఇంటికి వెళ్లి స్నానం చేసి, దుస్తులు మార్చుకుని నిద్రపోయాడు. నిస్సిగ్గుగా ప్రవర్తించిన ఈ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి, హత్య కేసు నమోదు చేశారు. గ్రామ ప్రజలు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. మహిళల భద్రతపై ఈ సంఘటన మళ్లీ ప్రశ్నలు తీసుకొచ్చింది.