Crime News

Crime News: కళ్ళముందే పోతున్న ప్రాణం.. పట్టించుకోని జనం.. ఇంత దారుణమా..?

Crime News: ఎదురుచూస్తున మనిషిని ఎవరు పాటించుకోకపోగా అసలు బ్రతుకున్నారా లేరా అనికూడా చూడకుండా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.. ఈ ఘటనని చూస్తుంటే మనిషులో మానవత్వం చచ్చిపోయిందా అనిపిస్తుంది.

ఇంత దారుణమైన ఘటన గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, కురగల్లులో జరిగింది. అసలు విషయానికి వస్తే.. ఒక్క బైకర్ ముందువెళ్తునా లారీని ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్లడానికి ప్రయతించారు కానీ రోడ్డుమీద ఉన్న ఇసుకలో టైర్‌ బ్యాలన్స్ కోలిపోవడంతో లారీ కింద బైక్‌ పడిపోయింది. స్పీడ్‌లో ఉన్న లారీ బైక్ పైనుండి వెళ్లిపోయింది. ఈ ఘటన అందరూ చూస్తుండగానే జరిగింది కానీ, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అది చూస్తూ ఉన్నారు తప్ప ముందుకు వెళ్లి సహాయం చేద్దాం అని అనుకోలేదు. చివరికి 108కి కాల్ చేదాం అని కూడా అక్కడ ఉన్న జనాలు అనుకోలేదు.

ఇలాంటి ఘటనలు చూస్తున్నప్పుడు భారతదేశంలో మానవత్వం ఫోన్‌లో స్టేటస్ వరకే పరిమితం అయిపోయింది అనిపిస్తుంది. రీల్స్ కోసం యూట్యూబ్‌లో వ్యూస్ కోసం సహాయం చేసే రోజులకి వచ్చేష్యం అనితెలిసి కూడా ఎదుటి వ్యాక్తి నుండి సహాయం కోరడం తప్పే కానీ ఆ పరిస్థితిలో ఆ ఘటన చూస్తున్న వ్వక్తిలో ఒక్కరు ఉంటె.. లేదా వారి కుటుంబంలోని ఒక్కరు ఉంటె ఇలాగే చేస్తారా అనేది ఇక్కడ ప్రశ్న..

ఈ మొత్తం పక్కనే ఉన్న సీసీటీవీలో రికార్డు అవ్వడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *