cricket: టెస్ట్ మ్యాచ్ కెప్టెన్ను ప్రకటించిన బీసీసీఐ

cricket: బీసీసీఐ 2025 ఇంగ్లాండ్ పర్యటనకు భారత టెస్ట్ జట్టును అధికారికంగా ప్రకటించింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (WTC) 2025-27 సైకిల్‌లో భాగంగా జరిగే ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ భారత జట్టుకు కెప్టెన్‌గా నడిపించనున్నాడు. రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.

కొత్త నాయకత్వం… కొత్త ఆశలు

రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌ నుంచి విరమించడంతో బీసీసీఐ యువతర నాయకత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో శుభ్‌మన్ గిల్‌కి భాద్యతలు అప్పగించింది. పంత్‌కు టెస్ట్ క్రికెట్‌లో గత పర్యటనలలో చూపించిన మంచి ప్రదర్శనల వల్ల వైస్ కెప్టెన్ పదవి లభించింది.

భారత టెస్ట్ జట్టు (2025 ఇంగ్లాండ్ టూర్‌కి):

బ్యాటర్లు:

* శుభ్‌మన్ గిల్ (కెప్టెన్)
* యశస్వి జైస్వాల్
* కేఎల్ రాహుల్
* సాయి సుదర్శన్
* కరుణ్ నాయర్
* నితీష్ రెడ్డి
* అభిమన్యు ఈశ్వరన్

వికెట్ కీపర్లు:

* రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్)
* ధృవ్ జురెల్

ఆల్‌రౌండర్లు:

* రవీంద్ర జడేజా
* వాషింగ్టన్ సుందర్

బౌలర్లు:

* జస్ప్రీత్ బూమ్రా
* మహ్మద్ సిరాజ్
* ప్రసిద్ధ కృష్ణ
* ఆకాష్ దీప్
* అర్ష్‌దీప్ సింగ్
* కుల్దీప్ యాదవ్
* శార్దూల్ ఠాకూర్

టెస్ట్ సిరీస్ షెడ్యూల్:

| టెస్ట్ | తేదీ | వేదిక |
| 1వ టెస్ట్ | జూన్ 20 | హెడింగ్లీ, లీడ్స్ |
| 2వ టెస్ట్ | జూలై 2 | లార్డ్స్, లండన్ |
| 3వ టెస్ట్ | జూలై 10 | ఒల్డ్ ట్రాఫర్డ్, మాంచెస్టర్ |
| 4వ టెస్ట్ | జూలై 23 | ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ |
| 5వ టెస్ట్ | జూలై 31 | ది ఓవల్, లండన్ |

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *