Congress: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లు కేటాయించాలని తేల్చింది.
ప్రస్తుతం రిజర్వేషన్లపై ఫైల్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండటంతో, పార్టీ స్థాయిలోనే ఈ రిజర్వేషన్ను అమలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
హైకోర్టు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలి అని గడువు విధించడంతో, త్వరలోనే ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.