Revanth Reddy: ముఖ్యమంత్రి శ్రీ రేవంత్రెడ్డి గారు ఈ నెల 13, 14 తేదీలలో మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ఆయన మేడారం గద్దెల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ ఆధునీకరణ పనులను మహాజాతర ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జాతర సందర్భంగా లక్షలాది మంది భక్తులు మేడారానికి వస్తారు. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం ఈ ఆధునీకరణ పనులు చేపట్టారు. ఈ పనుల పురోగతిని సీఎం రేవంత్రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తారు.