Cm revanth: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ఏర్పాట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమ్మిట్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతినిధులు పాల్గొనబోతున్న నేపథ్యంలో, అన్ని ఏర్పాట్లు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు.
సమ్మిట్కు అనేక దేశాల అంబాసిడర్లు కూడా హాజరయ్యే అవకాశం ఉండటంతో, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన ఈ కార్యక్రమంలో లోపాలు లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సీఎం రేవంత్ దిశానిర్దేశం ఇచ్చారు.
విద్యా, పరిశ్రమలు, పెట్టుబడుల రంగాల్లో తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే కీలక వేదికగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిలవనుందని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్ల ప్రతినిధుల రాకపోకలు, వసతి, భద్రత, సమావేశాల నిర్వహణ వంటి ప్రతి అంశాన్ని అత్యంత నిఖార్సుగా చూసుకోవాలని సీఎం పేర్కొన్నారు.
