CM Chandrababu

CM Chandrababu: కేంద్ర క్రీడాశాఖ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ.. ఎందుకంటే..? 

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు ముఖ్యంగా క్రీడల అభివృద్ధి అంశంపై దృష్టి సారించారు. బుధవారం కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో ఆయన భేటీ అయ్యారు. ఏపీలో ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, జల క్రీడల ప్రోత్సాహం వంటి అంశాలపై పలు విజ్ఞప్తులు చేశారు.

అమరావతిలో అంతర్జాతీయ స్థాయి శిక్షణా కేంద్రాలు

అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. అలాగే కృష్ణా నదీ తీరంలో జల క్రీడల శిక్షణా హబ్ ఏర్పాటు చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు.

నిధుల కోసం విజ్ఞప్తులు

చంద్రబాబు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కోరారు.

  • విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి రూ.27 కోట్లు

  • గుంటూరు బీఆర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్ కాంప్లెక్స్ కోసం రూ.170 కోట్లు

  • రాష్ట్రవ్యాప్తంగా క్రీడల అభివృద్ధికి రూ.341 కోట్లు

  • ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025 నిర్వహణకు రూ.25 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Rains: కుండపోత వర్షాలు – ఇప్పటివరకు 116 మంది మృతి

ఖేలో ఇండియా కేంద్రాలు & శిక్షణా హబ్‌లు

నాగార్జునా యూనివర్సిటీ, కాకినాడలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, తిరుపతి, రాజమహేంద్రవరం, నరసరావుపేట వంటి ప్రాంతాల్లో ఖేలో ఇండియా కింద మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. జిల్లాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అదనంగా ఖేలో ఇండియా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.

రాయలసీమలో క్రీడల అభివృద్ధి

తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. 2024-29 స్పోర్ట్స్ పాలసీ కింద రాష్ట్రంలో స్పోర్ట్స్ ఎకో సిస్టం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.

మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ ఆహ్వానం

ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2025ను ఏపీలో నిర్వహించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని చంద్రబాబు తెలిపారు. ఈ గేమ్స్‌ను విజయవాడ, విశాఖ వంటి అత్యుత్తమ క్రీడా వేదికలపై నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *