Chiranjeevi

Chiranjeevi: అక్కినేని అవార్డ్ పై బిగ్ బి, చిరు ట్వీట్స్ వైరల్!

Chiranjeevi: సోమవారం హైదరాబాద్ లో అక్కినేని జాతీయ అవార్డ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అమితాబ్ చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డ్ అందుకున్నారు. చిత్రరంగ ప్రముఖులతో పాటు నాగార్జున, చిరంజీవి కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ వేడుకలో అతిథులతో పాటు అవార్డ్ గ్రహీత చిరంజీవి ప్రసంగం ఆకట్టుకుంది. ఇక వేడుక ముగిసిన తర్వాత అటు అమితాబ్, ఇటు చిరు చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. అమితాబ్ చిరంజీవి, నాగార్జునతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ‘నా చేతుల మీదుగా చిరంజీవికి ఎఎన్నార్అవార్డ్ ప్రదానం చేయటం నాక దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇంత గొప్ప వేడుకలో నన్ను భాగం చేసినందుకు నాగార్జునకు ధన్యవాదాలు. ఎఎన్నార్ శతజయంతి సందర్భంగా వారి కుటుంబంలోని, పరిశ్రమలోని వ్యక్తిగా ఆయనకు నివాళులు అర్పించాను’ అని ట్వీట్ చేశారు. ఇక చిరంజీవి వేడుకకు సంబంధంచిన ఫోటోలు షేర్ చేస్తూ ‘ప్రతిష్టాత్మకమైన ఎఎన్నార్ అవార్డ్ అందుకోవడం సంతోషంగా ఉంది. అదీ నా గురువు అమితాబ్ చేతులమీదుగా మరింత ఆనందాన్నిచ్చింది. అక్కినేని కుటుంబ సభ్యులందరికీ, ఫౌండేషన్ సభ్యులకు, సుబ్బరామిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా సినీ ప్రయాణంలో భాగమై, నా మైల్ స్టోన్స్ లో సహకరించిన అందరికీ రుణపడి ఉంటాను’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ తో పాటు అమితాబ్ పాదాలకు చిరంజీవి నమస్కారం చేసిన వీడియో, చిరు మదర్ అంజనాదేవి పాదాలకి అమితాబ్ నమస్కరించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ALSO READ  Mahaa Vamsi: ఢిల్లీలో రేవంత్ గర్జన..కంగారు పెట్టించిన కొండా..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *