Chiranjeevi: తెలంగాణలో రాజకీయాలు, సినిమా రంగం కలిసిపోతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే, ఇటీవల ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె ప్రకటించిన కొన్ని గంటలకే మెగాస్టార్ చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది.
ఫిలిం ఫెడరేషన్ సభ్యులు ఆదివారం ప్రకటించిన ప్రకారం, షూటింగ్ లను సోమవారం నుంచి నిలిపివేయాలని నిర్ణయించారు. తమ వేతనాలు కనీసం 30 శాతం పెంచాలి అనే డిమాండ్తో ఈ సమ్మె చేపడుతున్నారు. నిర్మాతలు వేతనాలు పెంచిన షూటింగులకు మాత్రమే కార్మికులు హాజరుకాబోతున్నారు.
ఈ నేపథ్యంలో, చిరంజీవి జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
చిరంజీవి సీఎంకు బొకే ఇచ్చారు. సీఎం కూడా ఆయనకు శాలువ కప్పి సత్కరించారు. ఇద్దరూ కొద్ది సేపు హాయిగా మాట్లాడుకున్నారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనా? లేక ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యలపై ప్రత్యేకంగా చర్చించారా? అనే ఆసక్తికర చర్చ నెట్టింట కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Krishna Master Pocso Case: టాలీవుడ్లో మరో కొరియోగ్రాఫర్పై పోక్సో కేసు.. కృష్ణ మాస్టర్ అరెస్ట్
తెలంగాణ సీఎం కార్యాలయం ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్’ (ట్విట్టర్) లో షేర్ చేసింది. అందులో ఇద్దరూ నవ్వుతూ స్నేహపూర్వకంగా మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఇది చూసిన తర్వాతే, చిత్రపరిశ్రమ సమస్యలపై చిరంజీవి సీఎంతో చర్చించారని వార్తలు వచ్చాయి. కానీ అధికారికంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు.
రెండు రంగాల్లోనూ పెద్ద పాత్రధారులైన చిరంజీవి, రేవంత్ మధ్య జరిగిన ఈ భేటీపై త్వరలో స్పష్టత రావొచ్చు. కానీ ఇప్పుడే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి గారు మర్యాద పూర్వకంగా కలిశారు.@KChiruTweets #chiranjeevi #revanthreddy #megastarchiranjeevi pic.twitter.com/7lYXDtNk2N
— s5news (@s5newsoffical) August 4, 2025