Chandrababu Naidu: సింహాచలం ఘటనలో మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే క్షతగాత్రులకు రూ.3 లక్షల చొప్పన పరిహారం ప్రకటించింది. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించింది.
కాగా సింహాచలం ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో జిల్లా అధికారులు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు తదితరులు పాల్గొన్నారు.
సింహాచలం ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో మాట్లాడి ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.

