Hyderabad: సర్వేలో తప్పు సమాచారం ఇస్తే క్రిమినల్ కేసులు

Hyderabad: తెలంగాణలో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పుడు సమాచారం అందించినా, ఎన్యూమరేటర్లు తప్పుడుగా నమోదు చేసినా క్రిమినల్‌ చర్యలతోపాటు, కేసులు కూడా నమోదు చేయిస్తామని తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ హెచ్చరించారు.సమాచార సేకరణకు వచ్చే ఎన్యూమరేటర్లకు పౌరులు సహకరించాలని, సమస్య లు తలెత్తితే కలెక్టర్లు, బీసీ కమిషన్‌ దృష్టికి తేవాలని సూచించారు.

ఖైరతాబాద్‌లోని కమిషన్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేకు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారు. సొంత యంత్రాంగం, సిబ్బంది లేకపోవడం, బీసీ కమిషన్‌ కోరితేనే సర్వే బాధ్యతను ప్లానింగ్‌ శాఖకు ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు.

కాగా తెలంగాణలో కులగలను సర్వే ఇవ్వాల 9 నవంబర్ నాడు మొదలుకానుంది. ఈ సర్వే కి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ సహకరించాలని అధికారులు నాయకులు సూచిస్తున్నారు. సర్వేలో వారు అడిగిన విషయాలు తప్పకుండా ధ్రువీకరించాలని సూచిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *