Nalgonda

Nalgonda: నల్గొండ జిల్లా కేంద్రంలో దారుణ హత్య

Nalgonda: నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణ హత్య జరిగింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో ఓ వ్యక్తిని నరికి చంపేశారు. రామగిరి ప్రాంతంలోని గీతాంజలి కాంప్లెక్స్‌లో సురేశ్‌ మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్‌ను నిర్వహిస్తున్నారు.

రాత్రి సమయంలో సురేష్ ల్యాబ్‌లో ఉండగా, గుర్తు తెలియని దుండగులు మాస్కులతో వచ్చి వేట కత్తులతో ఒక్కసారిగా దాడిచేశారు. గుండెలో, మెడపై దారుణంగా నరికారు. తప్పించుకునే ప్రయత్నం చేసినా దుండగులు వదిలిపెట్టలేదు. దీంతో ఘటనా స్థలంలోని ఆయన మృతిచెందారు.

కుటుంబ కలహాలా, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి డీఎస్పీ శివరాం రెడ్డి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *