Taj Mahal: ప్రపంచ పర్యాటకంలో ప్రఖ్యాతిగాంచిన మన దేశ ప్రముఖ పర్యాటక ప్రాంతమైన స్మారక చిహ్నం తాజ్మహల్కు బెదిరింపు కాల్ మెయిల్ రావడంతో కలకలం రేగింది. తాజ్మహల్ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా హెచ్చరికలు చేశారు. 17వ శతాబ్దపు నాటి కట్టడమైన ఈ అద్భుత చిహ్నానికి గతంలో కూడా పలుమార్లు హెచ్చరికలు రావడం గమనార్హం.
బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాజ్మహాల్లో ఉన్న పర్యటాకులను అప్పటికప్పుడు బయటకు పంపించివేశారు. వద్దకు బాంబు డిస్పోజల్ బృందాలు, డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపి తనఖీలు నిర్వహించారు. తాజ్మహల్ను పేల్చి వేస్తామని వచ్చిన ఈ మెయిల్ బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని ఆగ్రా డీసీపీ సూరజ్ రాయ్ వెల్లడించారు. తాజ్మహాల్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదని తెలిపారు.