Suriya: తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన ఫోకస్ అంతా వెంకీ అట్లూరి సినిమాపై పెట్టాడు. ఈ కొత్త సినిమాతో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఈ హీరోయిన్ ఎవరు? పూర్తి వివరాలు ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం.
Also Read: Nidhi Agarwal: సోషల్ మీడియాలో ట్రోలింగ్.. క్లారిటీ ఇచ్చిన నిధి!
సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి సెకండ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మమితా బైజు లీడ్ హీరోయిన్గా నటిస్తుండగా, ఈ చిత్రానికి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.


