BJP: నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు.. శశిధర్ కు మాస్ వార్నింగ్

Bjp: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ చేసిన వారసత్వ రాజకీయాల వ్యాఖ్యలపై బీజేపీ నేత షెహజాద్ పూనావాలా స్పందించారు. శశిథరూర్ “నిప్పుతో ఆడుతున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబాన్ని నేరుగా విమర్శించడం ప్రమాదకరమని పూనావాలా సూచించారు.

శశిథరూర్ ఒక మీడియా కథనానికి ఇచ్చిన వ్యాఖ్యల్లో, దేశ రాజకీయాల్లో నెహ్రూ–గాంధీ కుటుంబ ఆధిపత్యం దశాబ్దాలుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి ఆ వంశానికి వచ్చిన ప్రతిష్ట వల్ల నాయకత్వం పుట్టుకతో వచ్చే హక్కు అన్న భావన బలపడిందని అన్నారు. అలాగే ఇతర పార్టీలలో కూడా వారసత్వ రాజకీయాలు పాతుకుపోయాయని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై పూనావాలా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ,“2017లో నేను రాహుల్ గాంధీ వారసత్వాన్ని ప్రశ్నించినప్పుడు నాకు ఏం జరిగిందో ఆయనకు గుర్తు ఉండాలి” అని అన్నారు. ఆ కుటుంబం ప్రతీకార స్వభావం కలిగిందని, శశిథరూర్ కోసం ప్రార్థిస్తున్నానని కూడా పేర్కొన్నారు.

2017లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నియామకం ముందే నిర్ణయించబడిందని, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం నకిలీ అని అప్పట్లో పూనావాలా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *