Bigg Boss 9: బిగ్బాస్ సీజన్ 9 ఎపిసోడ్ రోజు రోజుకి మరింత ఆసక్తికరంగా మారుతోంది. నిన్నటి ఎపిసోడ్లో హౌస్లో ఘాటు వాదనలు, వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. టెనెంట్స్ నుంచి ఓనర్ అవడానికి బిగ్బాస్ ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు. ఈసారి తమ కోసం ఆడాల్సి ఉంటుంది అని చెప్పడంతో టెనెంట్స్ అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
టాస్క్ రూల్స్
ఓనర్స్ కొన్ని బొమ్మలను విసరగా, వాటిని టెనెంట్స్ పట్టుకొని బాక్స్లో సేఫ్గా దాచుకోవాలి. ప్రతి రౌండ్లో ఎవరి దగ్గర తక్కువ బొమ్మలు ఉంటాయో వారు అవుట్ అవుతారు. చివరికి గెలిచిన వాడు టెనెంట్ నుంచి ఓనర్ అవుతాడు.
ఫస్ట్ రౌండ్ డ్రామా
మొదటి రౌండ్లోనే రాము రాథోడ్ ఫ్లోరాను టార్గెట్ చేయగా, రీతూ చౌదరి కూడా సంజనపై దాడి చేసింది. బజర్ మోగేసరికి ఫ్లోరా దగ్గర తక్కువ బొమ్మలు ఉండటంతో ఆమె ఎలిమినేట్ అయ్యింది. వెంటనే సంజన కూడా వాలంటరీగా క్విట్ చేస్తానని చెప్పి బయటకు వచ్చింది.
ఇది కూడా చదవండి: China: భారీ మొత్తంలో చమురు నిల్వ చేస్తున్న చైనా..!
సెకండ్ రౌండ్ టెన్షన్
రెండో రౌండ్లో సుమన్ శెట్టి, ఫ్లోరా, సంజన మధ్య ఘర్షణ జరిగింది. డిఫెండ్ చేసుకునే క్రమంలో ఫ్లోరాకు తాకడంతో సంచాలక్ ప్రియా సుమన్ను ఎలిమినేట్ చేసింది. “నేను కొట్టలేదు” అని సుమన్ వాదించినా ప్రియా మాట మార్చలేదు. కోపంతో సుమన్ బాస్కెట్ని తన్నేయడం హైలైట్గా మారింది. అదే సమయంలో రీతూ, సంజన మధ్య గట్టి వాదన జరిగింది. రీతూ కొట్టినా ఎందుకు ఔట్ చేయలేదని సంజన ప్రశ్నించడంతో పరిస్థితి హీట్ ఏకింది.
మూడో రౌండ్ లో ఫుల్ ఫైట్
మూడో రౌండ్ మొదలవగానే సంజన, ఫ్లోరా, సుమన్ కలిసి రీతూని అటాక్ చేశారు. రీతూ కూడా వెనకాడకుండా రాము, తనూజల బాస్కెట్ ఖాళీ చేసింది. రీతూ, ఇమ్మాన్యుయేల్ మధ్య “రేలంగి మావయ్య – రేలంగి అత్తయ్య” డైలాగులు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి.
ఫైనల్ రౌండ్ – రాము వర్సెస్ ఇమ్మూ
చివరికి రాము, ఇమ్మూ మాత్రమే మిగిలారు. ఇద్దరి మధ్య పెద్ద చర్చ, వాదనల తర్వాత టెనెంట్స్ ఓనర్గా మారేది రామేనని బిగ్బాస్ ప్రకటించారు. దీంతో రాము కొత్త ఓనర్గా హౌస్లోకి ప్రవేశించాడు.
మొత్తంగా నిన్నటి ఎపిసోడ్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్తో పాటు గట్టి డ్రామా అందించింది. రాము ఓనర్ అవ్వడం, ఇమ్మూ – రీతూ మధ్య డైలాగ్ వార్, ప్రియా తీసుకున్న నిర్ణయాలు హౌస్ వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి.