Bigg Boss 9: బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ రూల్స్ మార్చాడు. ప్రతి కంటెస్టెంట్కి ఒక్కరినే నామినేట్ చేసే అవకాశం ఇచ్చి, దానికి కేవలం ఐదు నిమిషాల టైమ్ లిమిట్ పెట్టాడు. ఈ క్రమంలో ఇమ్మాన్యూయేల్ భరణిని నామినేట్ చేస్తూ, గత కెప్టెన్సీ టాస్క్లో చేసిన తప్పులను గుర్తు చేశాడు. రీతూ చౌదరీ దివ్యపై మేనిప్యులేషన్ ఆరోపణలు చేస్తూ నామినేట్ చేసింది. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
గౌరవ్ సంజనను సెల్ఫిష్ ప్లేయర్ అని కామెంట్ చేస్తూ నామినేట్ చేశాడు. కళ్యాణ్ నిఖిల్ని గేమ్ సీరియస్గా ఆడాలని సూచిస్తూ నామినేట్ చేశాడు. నిఖిల్ దీనికి ప్రతిగా “నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్ని” అంటూ కౌంటర్ ఇచ్చాడు. దివ్య గౌరవ్ని టార్గెట్ చేస్తూ గేమ్లో క్లారిటీ లేదని విమర్శించింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది.
సుమన్ శెట్టి కూడా నిఖిల్ని నామినేట్ చేస్తూ “ఐదు వారాలుగా ఉన్నా ఇంకా ప్రాముఖ్యత రాలేదు” అని అన్నాడు. తనూజ, డీమాన్, భరణి, రీతూ వంటి కంటెస్టెంట్లు కూడా ఒక్కొక్కరిపై తమ వాదనలు వినిపించారు. ముఖ్యంగా భరణి–దివ్య మధ్య వాదన తీవ్రంగా మారి, హౌస్ అంతా చర్చలో మునిగిపోయింది.
Also Read: Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల కాంబో మూవీకి క్రేజీ టైటిల్..!
బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్
నామినేషన్స్ పూర్తయ్యాయని అందరూ అనుకున్న సమయానికే బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. “ఇంతవరకు మీరు ఒకరినొకరు నామినేట్ చేశారు. కానీ ఇప్పుడు నేను అందరినీ నామినేట్ చేస్తున్నాను” అంటూ ప్రకటించాడు. ఈ నిర్ణయం హౌస్మేట్స్నే కాదు, ప్రేక్షకులనూ ఆశ్చర్యానికి గురిచేసింది.
కెప్టెన్గా ఉన్న ఇమ్మాన్యూయేల్కి మాత్రమే ఇమ్యూనిటీ ఉందా లేదా అనేది హౌస్మేట్స్ చేతుల్లో పెట్టి, సీక్రెట్ బ్యాలెట్లో ఓటు వేయమన్నాడు బిగ్ బాస్. చివరికి ఎక్కువ మంది ఇమ్మాన్యూయేల్కి సేఫ్ ఓటు వేసినందున అతను తప్ప మిగిలిన 10 మంది కంటెస్టెంట్లు నామినేషన్లోకి వెళ్లారు.
ఈ వారం ఎలిమినేషన్ అత్యంత ఆసక్తికరంగా మారింది. గౌరవ్, నిఖిల్, భరణి పేర్లు ఎక్కువగా చర్చనీయాంశమవుతున్నాయి. బయట నుంచి కూడా వీరికి పెద్ద మద్దతు లేకపోవడంతో ఓటింగ్ ఫలితాలు ఎటు తిరుగుతాయో తెలియదు. ఇలా పదో వారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో నామినేషన్స్, వాదనలు, ట్విస్ట్లతో ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ఇక ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారనే ఉత్కంఠ మరింతగా పెరిగింది.
