Raj Gopal Reddy

Raj Gopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బిగ్ షాక్ .. షోకాజ్ నోటీసులు..?

Raj Gopal Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా విమర్శలు చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేయనుందని తెలుస్తోంది.పార్టీలో అంతర్గత విభేదాలను, నాయకత్వంపై అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరచడం పార్టీ నిబంధనలకు విరుద్ధం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

సీఎంకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి, ఆయనతో ఇవాళ సమావేశం కానున్నారు. రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడం, పార్టీలో అంతర్గత విభేదాలు బయటకు రాకుండా చూసుకోవడమే ఈ భేటీ ముఖ్య ఉద్దేశ్యం. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తాయని మల్లు రవి మీడియాకు తెలిపారు. అయితే, ఆయనకు నేరుగా షోకాజ్ నోటీసులు జారీ చేయడానికి ముందు, ఆయనతో మాట్లాడి ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాలనుకుంటున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Mohammed Siraj Net Worth: మహమ్మద్ సిరాజ్ నికర ఆస్తి విలువ ఎంత?

రాజగోపాల్ రెడ్డి నుంచి వచ్చే వివరణను బట్టి క్రమశిక్షణ కమిటీ తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలను మరింత పెంచుతాయా లేక సర్దుబాటు చేస్తాయా అనేది చూడాలి. కాగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వాడే భాష సరైనది కాదని, అది ప్రజలకు నచ్చడం లేదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడిన తీరును ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు వ్యక్తులు మాత్రమే అధికారంలో ఉన్నారని, కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభించడం లేదని పరోక్షంగా ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *